Type Here to Get Search Results !

Vinays Info

తొలి యూరోపియన్ల ప్రయత్నాలు - క్రైస్తవ మిషనరీల కృషి

తొలి యూరోపియన్ల ప్రయత్నాలు - క్రైస్తవ మిషనరీల కృషి | Early European Attempts - The Work of Christian Missionaries

  • క్రీ.శ 1498లో పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతోనే ఆధునిక విద్యావిధానం ప్రారంభమయింది. భారతదేశంలో విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలతో ప్రారంభమైంది. 
  • భారతదేశానికి వచ్చిన విదేశీ క్రైస్తవ మిషనరీలలో రోమన్ కాథలిక్ మిషన్లు మొట్టమొదటివి.
  • ఈ మిషనరీలు ప్రపంచంలో వివిధ దేశాలలో తమ మతవ్యాప్తి కోసం పాఠశాలలు స్థాపించాయి.
  • మనదేశంలో పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, డేన్, ఇంగ్లాండువాసులు ఆ విధంగానే క్రైస్తవ మతవ్యాప్తికి అనేక పాఠశాలలు స్థాపించారు. 
  • యస్.యస్ ముఖర్జీ “భారతదేశంలో ఆధునిక విద్యావిధానానికి ఆద్యులు పోర్చుగీసువారు” అన్నారు.
  • భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషిచేసిన మొట్టమొదటి మతబోధకుడు పోర్చుగీసుకు చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఇతను కాలినడకన గ్రామాలలో పయనించి క్రైస్తవ మతానికి చెందిన గ్రంథాలను పంచాడు.
  • ఇతడు బొంబాయి దగ్గర ల బాంద్రా వద్ద 1575 లో సెయింట్ ఆన్స్ కళాశాలను, కొచ్చిన్ వద్ద ముద్రణాలయాన్ని స్థాపించాడు. జీసుయిట్ మత సంస్థను స్థాపించాడు. ఆదివారం సెలవు దినంగా వీరు ప్రకటించారు.
  • సిలబస్ నన్ను పుస్తక రంగంలో వీరు ముద్రించారు.
  • 1578లో గోవా దగ్గరలోని 'చౌల్' లో మరొక కళాశాలను పోర్చుగీస్వేరు స్థాపించారు.
  • 1716లో భారత్లో “ట్రాంక్విబార్” వద్ద మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను "జిగెన్బార్గ్” ప్రారంభించాడు.
  • బైబిల్ను తమిళంలోకి “జిగెన్బార్గ్” అనువదించగా, “షుల్జ్” తెలుగులోకి అనువదించాడు.
  • వీరి విద్యాలయాలలో బోధించే అంశాలు 'మతప్రచారం"తో పాటు పోర్చుగీస్, లాటిన్ భాషలు, తర్కం, దివ్యజ్ఞానం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section