నెహ్రు రిపోర్టు లేదా నివేదిక - Nehru Report (1928)
భారత వ్యవహారాల కార్యదర్శి “లార్డ్ బిర్కెస్డ్” 1927 నవంబర్లో బ్రిటీష్ ఎగువసభలో మాట్లాడుతూ 'అందరికి సమ్మతమయిన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా' అనే సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెసు 1928 మే 19న బొంబాయిలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి రాజ్యాంగ రచనకు మోతిలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో 1928 ఆగస్టు 10వ తేదీన ఒక ఉపసంఘాన్ని నియమించింది.
ముఖ్యాంశాలు
- భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వడం
- భాషా ప్రయుక్త రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి రాష్ట్రాలు అనే రెండు అంశాల ఆధారంగా దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం
- కార్యనిర్వహకశాఖ, శాసనశాఖకు బాధ్యత వహించడం.
- అల్పసంఖ్యాకవర్గాల వారికి శాసనమండళ్ళలో కనీసం 10 ఏళ్ళపాటు కొన్ని స్థానాలను కేటాయించడం
- 19 ప్రాథమిక హక్కులను ప్రస్తావన
- గమనిక : మొదటిసారిగా ప్రాధమిక హక్కులను సూచించినది నెహ్రూ రిపోర్టు.