Type Here to Get Search Results !

Vinays Info

సైమన్ కమీషన్(Simon Commission) - 1927

సైమన్ కమీషన్(Simon Commission) - 1927

▪️ భారత ప్రభుత్వచట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి ఆనాటి బ్రిటీష్ ప్రధాని "బాల్డ్విన్” 1927 నవంబర్లో సర్ జాన్ సైమన్ నాయకత్వంలో 7గురు సభ్యులతో కూడిన ఒక రాయల్ కమీషన్ను నియమించింది. 

▪️ ఈ సంఘంలో సభ్యులందరూ ఆంగ్లేయులు కావడం వల్ల భారతీయులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. కమీషన్ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది. 

▪️ 1928 ఫిబ్రవరి 3 నుండి మార్చి 31 వరకు, రెండవ పర్యాయం 1928 అక్టోబర్ 11 నుండి 1929 ఏప్రిల్ 6వ తేదీ వరకు పర్యటించింది. ఈ కమీషన్ తన నివేదికను 1930లో సమర్పించింది.

ముఖ్యాంశాలు

  • రాష్ట్రాలలో ప్రవేశపెట్టిన ద్వంద్వపాలనను రద్దుచేయడం, మంత్రులు శాసనసభకు బాధ్యతవహించేలా చేయడం. 
  • భారతీయులకు తమ ప్రభుత్వ నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించడం
  • రాష్ట్ర శాసనమండళ్ళలో సభ్యత్వ సంఖ్యను పెంచడం
  • ఏకకేంద్ర వ్యవస్థ భారతదేశానికి పరిపడదు కనుక సమాఖ్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం.
  • హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను ఏర్పాటు చేయడం
  • సార్వజనీన వయోజన ఓటు హక్కు సాధ్యంకాదు దీనిని కాలానుగుణంగా విస్తృతం చేయడం
  • కమ్యూనల్ ప్రాతినిధ్యం సమంజసం కాకపోయినా దీనికి ప్రత్యామ్నాయం లేని దృష్ట్యా కొనసాగింపు

'మొదటిసారిగా సమాఖ్యను సూచించినది సైమన్ కమీషన్'. సైమన్ కమీషన్ అనేది భారత సమస్యలపైన ఒక సమగ్ర అధ్యయనం అని “కూప్లాండ్” అనే రచయిత పేర్కొంటారు. బ్రిటన్లోని లేబర్పార్టి ఈ నివేదికలోని అంశాలపైన తీవ్రమైన దృష్టిపెట్టలేదు. తరువాత వచ్చిన భారత ప్రభుత్వ చట్టం, 1935లో సైమన్ కమీషన్ ప్రతిపాదించిన అంశాలను పొందుపరిచారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section