ప్రపంచ హోమియోపతి దినోత్సవం(Wold Homeopathy Day)
ప్రపంచ హోమియోపతి దినోత్సవం ప్రతి ఏట ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యేల్ హనెమన్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
హోమియోపతీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్యవిధానం. జర్మన్ దేశానికి చెందిన డా. క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యేల్ హనెమన్ అనే ఫిజిషియన్ 1796లో ఈ వైద్యవిధానాన్ని, ఈ మాటని కనిపెట్టాడు.
మలేరియా వ్యాధి నివారణకు సంకోనబెరడుతో చేసిన మందువాడుతారని తెలుసుకున్న హనెమన్ ఆ బెరడు మలేరియాను ఏ విధంగా నివారిస్తుందో తెల్సుకోవాలనుకున్నాడు. అందుకోసం సింకోనా బెరడుతో కషాయం తయారు చేసుకొని తనమీద తన స్నేహితులమీద ప్రయోగాలు జరిపి, ఏ ఔషదమైతే ఆరోగ్యవంతునిలో ఒక వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందో ఆ లక్షణాలున్న వ్యాధికి ఆ ఔషదం ఇచ్చినప్పుడు వ్యాధి నయమవుతుందని తెలుసుకున్నాడు. తన ప్రయోగ ఫలితాలను గురించి 1976లో లాన్సెట్ జర్నల్లో ప్రచురించడంతోపాటు, ఈ నూతన వైద్య విధానికి హోమియోపతి గా నామకరణం చేశాడు.
- ప్రస్తుతం వైద్య విధానాల్లో హోమియోపతి వైద్యం రెండవ స్థానంలో ఉంది.
- 1813 సంవత్సరంలో జర్మనీలో టైఫాడ్ జ్వరం వచ్చినప్నుడు హోమియోపతి వైద్యంద్వారా ఆ వ్యాధి అరికట్టబడింది.
- 66 దేశాల్లో ఈ హోమియోపతి వైద్యం ప్రాచుర్యంలో వుండగా, భారతదేశ జనాభాలో 38 శాతం ప్రజలు ఈ వైద్యాన్ని పొందుతున్నారు.
- హోమియోపతి వైద్యం గురించి వస్తున్న నకిలీ వార్తలను అడ్డుకోవడానికి, హోమియోపతి విశిష్టతకు ప్రచారము కల్పించేందుకు అమెరికాలో 2005లో వరల్డ్ హోమియోపతి ఎవేర్నెస్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూ.హెచ్.ఏ.ఓ.) అనే సంస్థ ఏర్పాటుచేయబడింది. హాలెండ్ లో 2008, నవంబర్ 21న పూర్తిస్థాయి సంస్థగా రూపుదిద్దుకుంది.
- హోమియోపతికి విశేష ప్రచారము కల్పించడంకోసం ఈ దినోత్సవం రోజున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- వైద్య కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, హోమియోపతి వైద్య విశిష్టతను తెలియజేసే కరపత్రాలను పంచిపెడుతారు.
- సదస్సులు, సమావేశాలు నిర్వహించి హోమియోపతికి సంబంధించి కొత్త ఆలోచనలు ఆహ్వానిస్తారు. పరిశోధనలు జరుపుతారు.