Telangana

Sports


ఏప్రిల్ 4న 21వ కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో ప్రారంభమయ్యాయి. కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలో జరుగడం ఇది ఐదోసారి. క్రీడలను బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 దంపతులు ప్రారంభించారు. మొత్తం 71 దేశాలు పాల్గొంటుండగా, 6000 మంది క్రీడకారులు పాల్గొంటున్నారు.
-మనుబాకర్ (షూటింగ్) మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో స్వర్ణం
-పూనం యాదవ్ వెయిట్ లిఫ్టింగ్ (69 కేజీలు) స్వర్ణం
-మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు స్వర్ణం
-హీన సిద్ధు షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - రజతం
-రవికుమార్ షూటింగ్ 10 మీటరు - కాంస్యం
-వికాస్ ఠాగూర్ వెయిట్ లిఫ్టింగ్ 94 కేజీలు - కాంస్యం
International

National


మహిళా బైక్ రైడర్ల సాహసయాత్ర విజయవంతం
నలుగురు మహిళా బైక్ రైడర్లు తలపెట్టిన ఆరు దేశాల సాహసయాత్ర ఏప్రిల్ 8న విజయవంతంగా ముగిసింది. ఫిబ్రవరి 11న ఈ సాహసయాత్రను హైదరాబాద్లో ప్రారంభించిన జయభారతి, శాంతి, శిల్పాబాలకృష్ణన్, ప్రియా బహదూర్లు మయన్మార్, థాయ్లాండ్, లావోస్, వియత్నాం, కాంబోడియాతోపాటు భారత్లోని పలు ప్రాంతాలను సందర్శించారు.హైదరాబాద్లో బస్తీ దవాఖాన
-పేదలకు మెరుగైన వైద్య సేవలకు ఉద్దేశించిన బస్తీ దవాఖాన హైదరాబాద్లో ఏప్రిల్ 6న ప్రారంభమైంది. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ దవాఖానను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. నగరంలో ప్రతి 10 వేల మందికి ఒక దవాఖాన చొప్పున 100 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయనున్నారు.నాయినికి లోహియా పురస్కారం
-రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.. రామ్మనోహర్ లోహియా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. లోహియా 108వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 4న లోహియా విచార్మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆయనకు ఈ అవార్డును అందజేశారు.అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్
-మే 24 నుంచి 26 వరకు సెయింట్ పీటర్స్బర్గ్లో అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు మంత్రి కే తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.Sports

అత్యధిక బంతుల బౌలర్
-టెస్ట్ క్రికెట్లో అత్యధిక బంతులు విసిరిన మొదటి బౌలర్గా జేమ్స్ అండర్సన్ (30,020) నిలిచాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక బాల్స్ బౌలింగ్ చేసిన ఆటగాళ్లుగా మురళీధరన్ (44,039 బంతులు) మొదటి స్థానంలో ఉండగా, కుంబ్లే (40,850), షేన్వార్న్ (40,705) తర్వాత స్థానాల్లో ఉన్నారు.మిథాలి అత్యధిక వన్డేల రికార్డు
-మహిళల విభాగంలో అత్యధిక వన్డేలు (192) ఆడిన క్రికెటర్గా మిథాలి రాజ్ రికార్డు సృష్టించింది. 1999లో అంతర్జాతీయ మహిళల క్రికెట్లోకి ప్రవేశించింన మిథాలి వన్డేల్లో 6295 పరుగులు పూర్తిచేసింది. అత్యధిక వన్డేలు ఆడిన రికార్డు ఇప్పటివరకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట (191) ఉంది.ఈఎస్పీఎన్ అవార్డులు
-భారత్ తరఫున క్రీడల్లో విశేషంగా రాణించిన క్రీడాకారులకు ఈఎస్పీఎన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ఏప్రిల్ 3న ప్రకటించింది. ఉత్తమ క్రీడాకారిణిగా పీవీ సింధు, ఉత్తమ క్రీడాకారుడిగా కిదాంబి శ్రీకాంత్, ఉత్తమ కోచ్గా పుల్లెల గోపీచంద్, ఉత్తమ జట్టుగా భారత మహిళల హాకీ జట్టు ఎంపికయ్యాయి. మొత్తం 11 విభాగాలకు చెందిన క్రీడాకారులకు అవార్డులను ప్రకటించింది.కామన్వెల్త్ గేమ్స్

ఏప్రిల్ 4న 21వ కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో ప్రారంభమయ్యాయి. కామన్వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలో జరుగడం ఇది ఐదోసారి. క్రీడలను బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 దంపతులు ప్రారంభించారు. మొత్తం 71 దేశాలు పాల్గొంటుండగా, 6000 మంది క్రీడకారులు పాల్గొంటున్నారు.
-మనుబాకర్ (షూటింగ్) మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో స్వర్ణం
-పూనం యాదవ్ వెయిట్ లిఫ్టింగ్ (69 కేజీలు) స్వర్ణం
-మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు స్వర్ణం
-హీన సిద్ధు షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - రజతం
-రవికుమార్ షూటింగ్ 10 మీటరు - కాంస్యం
-వికాస్ ఠాగూర్ వెయిట్ లిఫ్టింగ్ 94 కేజీలు - కాంస్యం
బహ్రెయిన్ గ్రాండ్ప్రీ విజేత వెటల్
2018, ఏప్రిల్ 8న బహ్రెయిన్ గ్రాండ్ప్రీ టైటిల్ విజేత సెబాస్టియన్ వెటల్ (ఫెరారీ డ్రైవర్). ఇదే సీజన్లో ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రి టైటిల్ను కూడా గెలిచాడు.International

నామ్ సదస్సు
అలీన (నామ్) దేశాల 18వ మధ్యకాలిక మంత్రుల సమావేశం అజర్ బైజాన్ రాజధాని బాకులో ఏప్రిల్ 5, 6 తేదీల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఉగ్రవాద నిర్మూలనపై ప్రసంగించారు. 1961లో ఏర్పడిన ఈ సంస్థలో ప్రస్తుతం 120 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.సౌదీలో తెరుచుకోనున్న థియేటర్లు
మూడున్నర దశాబ్దాల తర్వాత సౌదీ అరేబియాలో ఈ నెల 18న సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి.రెండు దేశాలకు కొత్త అధ్యక్షులు
ఏప్రిల్ 3న జరిగిన ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో అబ్దెల్ ఫతా ఎల్ సిసి రెండో సారి విజయం సాధించారు.కోస్టారికా అధ్యక్షుడిగా వామపక్ష అభ్యర్థి కార్లోస్ అల్వరాడో ఏప్రిల్ 2న ఎన్నికయ్యారు. అత్యంత పిన్న వయస్సున్న (38 ఏండ్లు) అధ్యక్షుడిగా ఆయన రికార్డుల్లో నిలిచారు.సింగపూర్ ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రీతంసింగ్
ఏప్రిల్ 8న సింగపూర్ ప్రతిపక్ష పార్టీ నేతగా భారత సంతతికి చెందిన ఎంపీ ప్రీతంసింగ్ ఎన్నికయ్యారు. 2011, మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో థియా చియాంగ్పై ప్రీతం విజయం సాధించారు. 2001 నుంచి వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నారు.సూర్యుడిపై అన్వేషణకు ప్రయోగం
సూర్యుడిపై వాతావరణం అధ్యయనం కోసం డెల్టా ఫోర్ హెవి లాంచ్ వెహికిల్ ద్వారా పార్కర్ సోలార్ ప్రోబ్ను 2018, జూలై 31న ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. దీని జీవితకాలం ఏడేండ్లు.National
