చరిత్ర పూర్వ యుగం - చారిత్రక యుగం(Prehistoric Era - Historical Era)
తెలంగాణ చరిత్ర పూర్వయుగం
- చరిత్ర పూర్వయుగం అంటే లిఖిత పూర్వక ఆధారాలు లేని యుగం
- లిఖిత ఆధారాలు లభిస్తున్న గత 2300 సంవత్సరముల కాలాన్ని చారిత్రక యుగం అంటారు.
- తెలంగాణాలో మొదటిసారిగా చరిత్ర పూర్వ యుగానికి (బృహత్ యుగానికి) సంబందించిన ప్రదేశం నల్గొండ జిల్లా లోని వలిగొండ, దీనిని పరిశోధన చేసినవారు - రాబర్ట్ బ్రూస్ పూట్.
- హైదరాబాద్ పురావస్తుశాఖ 1914లో ఏర్పాటు చేయబడింది.
- కొత్త రాతియుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్టు - రాగి
- రాక్షసగూళ్ళ యుగంలో మానవుడు ఉపయోగించిన పనిముట్లు - ఇనుప పనిముట్లు, కావున ఈ కాలాన్ని అయో (ఇనుప) యుగమని కూడా అంటారు. ఈ యుగంలో చిన్న చిన్న రాజ్యాలు, లిపి, నాగరికతా చిహ్నాలు ప్రారంభమైనవి. కాబట్టి ఈ యుగాన్ని "చరిత్ర పూర్వ యుగం" , "చారిత్రక యుగం", "మధ్య సంధి యుగం (ప్రోటో హిస్టరీ) లేదా "పురా చారిత్రక యుగం" అని అంటారు.
- చరిత్ర పూర్వ యుగాన్ని వారు వాడిన పనిముట్ల ఆధారంగా కూడా పిలుస్తారు.
- దిగువపాత రాతియుగం - గులక రాయి పనిముట్లు
- మధ్య పాత రాతియుగం - రాతి పెచ్ఛుల పనిముట్లు
- ఎగువ పాత రాతియుగం - కొచ్చెటి పనిముట్లు
- మధ్య రాతియుగం - చిన్న చిన్న రాతి పనిముట్లు
- కొత్త రాతి యుగం - నున్నటి పనిముట్లు
- రాక్షసగుళ్ల యుగం - ఇనుప లోహ పనిముట్లు
- దిగువ పాత రాతియుగం (3 నుంచి 1.30 లక్షల సంవత్సరాల క్రితం):
- ఈ యుగానికి చెందిన ముఖ్యమైన ప్రదేశాలు
- ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ , పొచ్ఛేర జలపాతం
- కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖిని , రామగుండం
- ఖమ్మం జిల్లాలోనే పాల్వంచ
- నల్గొండ జిల్లాలోని రాయవరం, ఏలేశ్వరం, నాగార్జున కొండ
- మహబూబనగర్ జిల్లా లోని చంద్రగుప్త పట్టణం, ఈర్ల దిన్నె
- పెద్ద ఆకారాలతో ఉండే చేతి గొడ్డళ్లు, గోఖుడు రాళ్లు , వృత్తాకారపు రాళ్ళూ, ఈ యుగపు మనుషుల వేటలో మరియు ఆహారణ సేకరణలో ఉపయోగపడ్డాయి .
- ఈ యుగపు ఆయుధాలు ఆఫ్రికా లోని "అష్యులియన్" ప్రాంతపు ఆయుధాలతో పోలి ఉన్నాయి .
- మధ్య పాత రాతి యుగం (1 లేదా . లక్షల సంవత్సరాల క్రితం):
- మొదటిసారిగా ఎద్దు అస్థిపంజరం అవశేషాలు లభించిన ప్రదేశం - మహబూబనగర్ జిల్లాలోని యపాలపాడు దగ్గర జరిపిన త్రవ్వకాల్లో. దీనినిబట్టి ఈ యుగపు మానవులకు ఎద్దులతో సంబంధం ఉంది అని అర్ధం అవుతుంది.
- ఈ యుగపు మానవులు వదిన పనిముట్లు - చిన్న తరహా గొడ్డళ్లు, గండ్ర గొడ్డళ్లు, గోకుడు రాళ్లు
- ఎగువ పాత రాతి యుగం(క్రీ. పూ. 20000 - 10000 సంవత్సరాల క్రితం) :
- ఈ యుగంలో జీవించిన ప్రజలు బ్లేడ్ పనిముట్లు, ప్రక్క అంచు ఉన్న బ్లేడ్ పనిముట్లు, కొన్నిచోట్ల ఎముకలతో చేసిన పనిముట్లను వాడారు.
- రాతి గుహల్లో రంగు బొమ్మలను గీయడం నేర్చుకున్నారు
- ఇది "హాలోసీన్" ఆరంభ దశను చుసిస్తుంది.
మధ్య రాతి యుగం(క్రీ.పూ. 8500 - 3000 సంవత్సరాల క్రితం):
- భౌగోళిక వాతావరణ పరంగా "తోలి హాలోసీన్" యుగానికి చెందినది.
- ఈ యుగంలో అతి చిన్న (సూక్ష్మ) రాతి ఆయుధాలను వాడారు.
- ఈ యుగాన్ని 'సూక్ష్మ రాతి యుగం" అని కూడా అంటారు.
- ఈ యుగానికి చెందిన గుహల్లోని రంగు చిత్రాల్లో 150 కి పైగా బొమ్మలు కనిపిస్తాయి.
- వీటిలో ప్రధానంగా జింక, చెవుల పిల్లి, హైనా, నక్క, కుక్క, తాబేలు, రేఖాగణిత నమూనాలు సున్నపురాయి, గ్రానైట్ రాయి కొండా గుహలలో కనిపిస్తాయి.
- వీటిలో ముఖ్యమైనది జింక చిత్రం.