జాతీయ జెండా (NATIONAL FLAG OF INDIA)
- 1947 జూలై 22న భారత జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
- 1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ సూచన మేరకు పింగళి వెంకయ్య (కృష్ణా జిల్లా) జాతీయ పతాకాన్ని రూపొందించారు.
- 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీనిని ఆమోదించారు.
- జాతీయ పతాకాన్ని తొలిసారిగా 1929 డిశంబర్ 31న లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రావి నది ఒడ్డున జవహర్ లాల్ నెహ్రూ ఎగురవేశారు.
- జాతీయ జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి 3 : 2.
- జాతీయ జెండా పైభాగాన ముదురు కాషాయము (కేసరి), మధ్యభాగాన తెలుపు, క్రింది భాగాన ముదురు ఆకుపచ్చ రంగులు ఉంటాయి.
- మధ్యభాగమైన తెలుపు పట్టీ మీద ముదురు నీలి రంగుతో, కూడిన చక్రం ఉంటుంది. ఈ చక్రం సారనాథ్ (ఉత్తరప్రదేశ్)లోని అశోకుని సింహచక్రాన్ని (ధర్మచక్రం) పోలి ఉంటుంది.
- ఈ చక్రం 24 ఆకులు (Spokes) కల్గి ఉండును.
- జాతీయ జెండా విదేశాలలో ఎగురవేసిన మహిళ - మేడం భికాజీ కామా (జర్మనీలో స్టట్గార్ట్)
జాతీయ జెండాలోని
కాషాయం
తెలుపు
ఆకుపచ్చ