తెనాలి రామకృష్ణుడు

VINAYS INFO
VINAYS INFO

తెనాలి రామకృష్ణుడు :

క్రీ.శ. 1500 సంవత్సరానికి ఐదారేళ్ళు కొంచెం కుడి ఎడంగా తెనాలి గ్రామంలో గార్లపాటి వారి కుటుంబంలో రామకృష్ణుడు జన్మించాడు. 1525 ప్రాంతంలో కృష్ణదేవరాయల వారి అష్టభానుడు పడమటకు వాలుతున్న కాలంలో ఆస్థాన ప్రవేశం చేశాడు. అక్కడ ఉంటూనే "కందర్పకేతువిలాసం" రచించాడు. రాజాశ్రయం కోసం భట్టరు చిక్కాచార్యుల వారి వద్ద వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. వైష్ణవాన్ని స్వీకరించాక "హరిలీసావిలాసము" రచించాడు. రాయల వారి ఆస్థానంలో రామకృష్ణునికి సంబంచించిన కథలు కోకొల్లలు. వికటకవిగా, విదూషకునిగా దక్షిణ భారతదేశంలో ఇతనికున్న పేరు మరెవ్వరికీ లేదు. "పాండురంగ మహాత్మ్యం"ను రచించి విరూరి వేదాద్రికి అంకితమిచ్చాడు. ఔచిత్యం లేని సంస్కృతాన్ని తెచ్చి చక్కని జాతీయత ఉట్టిపడే తెలుగు పదాలతో జోడించి సమాసాలు కట్టడం అతనికే తెలుసు.

You may like these posts

Post a Comment