Type Here to Get Search Results !

Vinays Info

తెలుగు సాహిత్య ప్రక్రియలు – కథ(Short Story)

తెలుగు సాహిత్యంలో కథ, కథానిక అనేవి పర్యాయపదాలుగా వాడబడుతున్నాయి.

-ప్రపంచ కథానికలకు ఆద్యవూబహ్మ అనదగినవాడు – గుణాఢ్యుడు. ఈయన పైశాచిక భాషలో బృహత్కథను రాశారు.

-కథానిక అని పేరు పెట్టినవారు – ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.

-కథానిక అంటే చిన్నకథ. ఆంగ్లంలో Short Story కి సమానార్థకంగా తెలుగులో వాడబడుతున్న పదం కథానిక.

-కథానిక ప్రస్తావన గల పురాణం – అగ్ని పురాణం

-భయానక రసం, కరుణరసాత్మకమై, మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగించేదిగా ఉంటూ, అద్భుతమైన విషయాలతో కూడుకొని సంక్షిప్తంగా చెప్పబడే ఉదాత్తమైన సాహితీ ప్రక్రియ కథానిక అని అగ్ని పురాణంలో ప్రస్తావించబడింది.


కథానిక నిర్వచనాలు

-సాధారణంగా నీతి విస్తక్షుతక్షేత్రం కలిగి ఒకానొక సంవేదనతో కూడి స్వయం సంపూర్ణమై దానిలోని విభిన్న తత్వాలను ఏకోన్ముఖంగా చూపే ఇతివృత్తాత్మక గద్య కవితా శిల్పఖండమును కథానిక అనవచ్చు- బొడ్డపాటి కుటుంబరాయశర్మ ( తెలుగు విజ్ఞాన సర్వస్వం)

-ఒక రకమైన ఎత్తుగడ, నడకతీరు, ముగింపు, పరిమితపావూతలు, ఆ పావూతలకు చక్కని పోషణ, వస్తువిన్యాస వైశిష్టం, ఒక జీవితసత్యాన్ని ప్రతిపాదించటం, అన్నిటినిమించి వస్తువైక్యత ఉండి వినోదమో, విజ్ఞానమో, వికాసమో కలిగించగల చిన్న కథ కథానిక- జీ నాగయ్య (తెలుగు సాహిత్య సమీక్ష రెండో సంపుటం)


కథానిక లక్షణాలు:


సంక్షిప్తత, సమక్షిగత, ఏకాక్షిగత, నిర్భరత

-తెలుగులో తొలి కథానికగా గురజాడ అప్పారావు 1910లో రచించిన ‘దిద్దుబాటు’ వూపసిద్ధిగాంచింది. కాని బండారు అచ్చమాంబ 1901లో రచించిన ‘లలితాశారదలు’ తెలుగులో తొలి కథానిక. 1902లో ఈమె రచించిన మరో కథానిక ‘ధనవూతయోదశి’.

-ఆధునిక తెలుగుకథకు ఆద్యురాలు – బండారు అచ్చమాంబ

-దిద్దుబాటు కథానికకు గురజాడ పెట్టిన మొదటిపేరు – కమలిని. ఇది 1910, ఫిబ్రవరిలో ఆంధ్రభారతి పత్రికలో ప్రచురింపబడింది. దిద్దుబాటులో నాయికా నాయకులు కమలిని, గోపాలరావు.

-గురజాడ రచించిన ఇతర కథానికలు – మీ పేరేమిటి, మతము, విమతము, మెటిల్డా, సంస్కర్త హృదయం, పెద్ద మసీదు.

-1903లో ఆచంట వేంకటసాంచ్ఛాయన శర్మ రచించిన కథానిక – లలిత.

-1912లో మాడపాటి హనుమంతరావు రాసిన కథ – హృదయశల్యం. ఈయన వెలువరించిన కథా సంపుటి – మల్లికాగుచ్ఛం.

-మాడపాటి హనుమంతరావు రచించిన ‘నేనే’ అనే కథలో కథానాయిక – హైమావతి.

-1913లో బండారు శ్రీనివాసరావు రాసిన కథ – రాజయ్య సోమయాజులు. ఇది 1914లో హితబోధిని పత్రికలో అచ్చయింది.

-సురవరం ప్రతాపడ్డి రచించిన కథలు – హుసేన్‌బీ, అపరాధం, వింతవిడాకులు, నిరీక్షణ, మొగలాయి కథలు, చంద్రయ్య భీమా, పెండ్లిబేరము.

-స్త్రీ పునర్వివాహమును చిత్రిస్తూ 1921లో షబ్నవీసు రచించిన కథ- బాలికావిలాపం.

-వెట్టిమాదిగ కథా రచయిత- భాగ్యడ్డివర్మ (ఇది తొలి దళితకథ).


-నిజాం సంస్థానం విలీనం ఇతివృత్తంగా నెల్లూరి కేశవస్వామి రచించిన కథ- యుగాంతం

-గొల్లరామవ్వ కథా రచయిత – పీవీ నరసింహారావు

-చింతా దీక్షితులు రచించిన కథలు – దాసరిపాట, కిష్కింధలో కోతి, అభివూపాయభేదం, పెద్దమేడ, గోదావరి నవ్వింది, చెంచురాణి, గాలిపాటు, సుగాలీకుటుంబం, స్వకీయ చరిత్ర, తాడివనంలో, ఊరిపేరు, దేశభక్తి, వటీరావు, శిలావూపతిమ మొదలైనవి. ఈయనకు గల బిరుదు – కథక చక్రవర్తి.

-శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన కథలు – కలుపుమొక్కలు, గులాబి అత్తరు, వడ్లగింజలు, మార్గదర్శి, ఇలాంటి తవ్వాయి వస్తే, విషభుజంగం, ఆడపడుచు, తల్లివూపాణం, అన్నంతపనీ జరిగింది, తాపీమేస్త్రీ, రావు దీక్షితులు, బీఏ మొదలైనవి.

-వేలూరి శివరామశాస్త్రి రచించిన కథలు – నఖల్ హైద్రాబాద్, ఊరిబడి, జన్మాంతర సంబంధం, మాలదాసరి, మూడు తమాషాలు, రాచపట్టు, డిప్రెషన్‌చెంబు.

-మొక్కపాటి నర్సింహశాస్త్రి కథలు- చిత్రం, గత్యంతరం, భిక్షువు, మహత్తు, శిల్పిద్వయం, చావు తెలివి, పిలక మొదలైనవి.

-తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంలో వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన కథలు- జైలులోపల కథలు.


-విశ్వనాథ సత్యనారాయణ రచించిన కథలు- నీ ఋణం తీర్చుకున్న, మాక్లీ దుర్గంలో కుక్క, ముగ్గురు బిచ్చగాళ్లు, ఏమి సంబంధం, యోర్విష్‌ఖేయ్ మొదలైనవి.

వేలూరి శివరామశాస్త్రి రచించిన కథలు – నఖల్ హైద్రాబాద్, ఊరిబడి, జన్మాంతర సంబంధం, మాలదాసరి, మూడు తమాషాలు, రాచపట్టు, డిప్రెషన్‌చెంబు.

-మొక్కపాటి నర్సింహశాస్త్రి కథలు- చిత్రం, గత్యంతరం, భిక్షువు, మహత్తు, శిల్పిద్వయం, చావు తెలివి, పిలక మొదలైనవి.

-తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంలో వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన కథలు- జైలులోపల కథలు.


-విశ్వనాథ సత్యనారాయణ రచించిన కథలు- నీ ఋణం తీర్చుకున్న, మాక్లీ దుర్గంలో కుక్క, ముగ్గురు బిచ్చగాళ్లు, ఏమి సంబంధం, యోర్విష్‌ఖేయ్ మొదలైనవి.

-వస్తువులోనూ, శైలిలోనూ తెలుగుకథలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన రచయిత- చలం. ఈయన రచించిన కథలు- ఓ పూవు పూసింది, ఆ రాత్రి, పాపఫలాలు, జలసి, హరిజన సమస్య, ఆమెపెదవులు, ఆమె త్యాగం, నేనేం చేశాను, దోషగుణం, కర్మమిట్లాకాలింది మొదలైనవి.

-అడవి బాపిరాజు రచించిన కథలు- హిమాలయరశ్మి, తిరుపతి కొండమెట్లు, నాగలి, శైలిబాల, భోగీరలోయ, కన్నీరు, తూలికానృత్యం, తరంగిణి, రాగమాలిక, అంజలి, నరసన్న పాపాయి, గుడ్డిపిల్ల, ద్వేషము మొదలైనవి.

-కనుపర్తి వరలక్ష్మమ్మ రచించినవి- ఒట్టు, మావూరు

-భమిడిపాటి కామేశ్వరరావు కథలు- దానికేమందు, మాటలేనా, మడతపేచీ, గుసగుస పెళ్లి, తోడుదొంగలు, సమస్య మొదలైనవి.

-మునిమాణిక్యం నరసింహారావు కథలు- కాంతం కథలు, శరవూదావూతులు, నేను- మా కాంతం.

-‘కరుణ కుమార’ కలం పేరుతో కందుకూరి అనంతం రచించిన కథలు- కయ్య కాలువ, బిల్లల మొలతాడు, ఆకలిమంటలు, రిక్షావాలా, మొక్కుబడి, కొత్త చెప్పులు, పోలయ్య, సన్నజీవాలు.


-తూడిపెద్ది వెంకటరమణ కథలు- రుమాలు, పుష్పక విమానం.

-కథకుల గురువుగా పేరుగాంచిన మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన కథలు- రంగవల్లి, మునిగోరింట, మత్తకోకిల, కామునిపున్నమి, వెన్నెల గులాబీలు, తపస్విలోకం, పంచ చామరం, చెంగలవ్వా, రజమంజరి, వనమాలి, రంగవల్లి, మాద్రి, నేతి నేతి, డుమువులు, చైత్రరథం, సర్వమంగళ.

-కొడవగంటి కుటుంబరావు కథలు- నీకేంకావాలి, దత్తపువూతుడు, అమాయకురాలు, కులద్వేషం, ఒంటిస్తంభం మేడ, నువ్వులు- తెలకపిండి, కొత్తజీవితం, తిండిదొంగ, ఆడజన్మ, లేచిపోయిన మనిషి, పాపఫలం, సుడిగుండాలు, ఫోర్త్ డైమన్షన్, పక్షి కోసం వెళ్లిన పంజరం మొదలైనవి.

-పాట్లపల్లి రామారావు రచించిన కథలు- జైలు, న్యాయం

-కాంచనపల్లి చిన వెంకట రామారావు రచించిన కథలు – దావతు, ఆకలి, చెరువొడ్డున (హిందూ,ముస్లిం దొరలు నీటిని పొలాలకందకుండా ఎత్తువేస్తే, హిందూ, ముస్లిం రైతులు ఏకమై పోరాడి గెలిచే ఇతివృత్తం గల కథ) మొదలైనవి.

-తెలంగాణ మంటల్లో కథ రచయిత- అయోధ్యరామకవి

-మంద రామాడ్డి రచించిన కథ- సర్కారు కిస్తు

-తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో ఆవుల పిచ్చయ్య రచించిన కథలు- ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమీందారు, దౌరా, ఊరేగింపులు, దినచర్య, వెట్టిచాకలి, ఈ కథలను సేకరించి వెలుగులోనికి తీసుకొచ్చిన పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో ఆవుల పిచ్చయ్య రచించిన కథలు- ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమీందారు, దౌరా, ఊరేగింపులు, దినచర్య, వెట్టిచాకలి, ఈ కథలను సేకరించి వెలుగులోనికి తీసుకొచ్చిన పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్.

-భాస్కరభట్ల కృష్ణారావు కథలు- చంద్రలోకానికి ప్రయాణం, కృష్ణారావు కథలు, వెన్నెలరాత్రి, ఇజ్జత్ మొదలైనవి.

-తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రిస్తూ పాకాల యశోదాడ్డి రచించిన కథలు మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి.. మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల.

-చరమరాత్రి కథ సంపుటి రచయిత – శ్రీశ్రీ. ఈ సంపుటిలోకి కథలు- అనామిక, హేమంతం, అశ్వమేధయాగం, కోనేటిరావు కథలు.

-చైతన్య ధోరణిలో కథలను రచించిన తొలి రచయిత – శ్రీశ్రీ

-త్రిపురనేని గోపిచంద్ రచించిన కథలు- ధర్మవడ్డీ, హిందూ పాతివూవత్యం, వెంకటాచలం పాత్ర, పీడిత హృదయం, కూపస్థ మండూకం, మమకారం, దేవుని జీవితం, దేశం ఏమయ్యేటట్టు, గీతాపారాయణం, ఆత్మవూదోహులు, భార్యల్లోనే ఉంది, జనాభా, ఆపద్బాంధవ్యం మొదలైనవి.

-పాలగుమ్మి పద్మరాజు కథలు- గాలివాన, పరిహారం, పడవ ప్రయాణం, కూలిజనం, వాసనలేని పువ్వులు, వెండిసీసా, సుబ్బి, ఆశాజీవులు. 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ కథానికల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన కథ- గాలివాన.


-ఇల్లిందల సరస్వతీదేవి రచించిన కథ లు- ముత్యాల మ నసు, స్వర్ణకమలా లు, పండుగ బహుమానం, జైలులోప ల, బలీయసీ కేవలమీశ్వరాజ్ఞ. తులసీదళాలు, స్నేహబం ధం, మనిషివేట, ఓల్డ్‌ఏజ్‌హోమ్, స్త్రీ నీకు రక్షణ ఎక్కడ? మొదలైనవి. కేంద్ర సాహిత్య అకాడమి, రాష్ట్ర సాహిత్య అకాడమి బహుమతులను పొందిన కథా సంపుటి- స్వర్ణకమలాలు

-బుచ్చిబాబు కథలు- తెరచాపదించిన పడవ, ఆరుగురు కథకులు, ఒక నాయిక, నన్నుగురించి కథ రాయవూ, ఊడిన చక్రం, వాడిన పుష్పం, కలలో జారిన కన్నీరు, ఆ వాడిన ఆకులు, నిరంతరవూతయం, కాలచక్రం నిలిచింది, ఆమెనీడ, మరమేకులూ- చీరమడతలు, మూడు కోతులు మొదలైనవి.

-మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే కథలు – బండరాముడి పెళ్లి, బల్లకట్టు పాపయ్య, మూగజీవాలు, అభిమానం.

-చాగంటి సోమయాజులు రచించిన కథలు – వాయులీనం, పరవూబహ్మం, కుక్కు బండపాటు, కుంకుడాకు, బుగ్గి బూడిదమ్మకథ, భల్లూక స్వప్నం, చిన్నాజీ, దుమ్ములగొండి, బొండు మల్లెలు, ఎంపు, ఎందుకుపారేస్తావు నాన్నా, బదిలీ మొదలైనవి.

-రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు- ఆరుసారా కథలు, కలకంఠి, ఋక్కులు, కార్నర్ సీటు, రొట్టెముక్క, జరీ అంచు చీర, నల్లమేక, ఎండ, పిపీలికం, వెన్నెల మొదలైనవి.

-బుడుగు, సీగాన పసూనాంబ, అప్పారావు, రాధాగోపాలం, రెండుజడల సీత వంటి పాత్రలను సృష్టించిన చమత్కార హాస్య కథల రచయిత- ముళ్లపూడి వెంకటరమణ. ఈయన రచించిన కథలు- కానుక, ఆకలి ఆనందరావు, యువరాజు మహారాజు మొదలైనవి. వెలువరించిన కథా సంపుటాలు- వేట, జనతా ఎక్స్‌వూపెస్, రాధాగోపాలం కథలు, సీతా కళ్యాణం.

-కాళీపట్నం రామారావు కథలు- యజ్ఞం, ఆర్తి, భయం, జీవధార, తీర్పు, కుట్ర, చావు, నోరూమ్, పెంపకపు మమకారం, అవిద్య, రాగమయి మొదలైనవి. ‘ఋతుపవనాలు’ అను కథా సంపుటిని వెలువరించారు. ‘యజ్ఞంతో తొమ్మిది’ కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి లభించింది.

Source: NT Nipuna

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section