ఇక్కడ 20, 50, 100, 500, 1000 రూపాయల నోట్లు ముద్రిస్తారు.
» సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్
దీన్ని 1982లో ఏర్పాటు చేశారు. ఇక్కడ కోర్టు స్టాంపులు, స్మృతి స్టాంపులు, కిసాన్ వికాస్ పత్రాలు, ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు ముద్రిస్తారు.
» సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హోషంగాబాద్ (మధ్యప్రదేశ్):
ఇక్కడ కరెన్సీ నోట్లకు అవసరమైన కాగితాన్ని తయారుచేస్తారు.
కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ ముద్రణను 1996లో ప్రవేశపెట్టారు.
2012 జనవరి నుంచి కరెన్సీ నోట్లపై రూపాయి చిహ్నాన్ని సూచించే '₹’ గుర్తును ముద్రిస్తున్నారు.
‘₹’ గుర్తు రూపకర్త - ఉదయ్కుమార్ ధర్మలింగం. ఇతడు తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు.
ప్రతి కరెన్సీ నోటుపై 17 భాషల్లో దాని విలువ ముద్రించి ఉంటుంది. నోటు వెనుకవైపు కింది భాగంలో ఒక వైపు హిందీ, మరోవైపు ఇంగ్లిష్ భాషల్లో, నోటుకు ఎడమవైపు పైభాగంలో ఒక పట్టికలో 15 భాషల్లో (మొత్తం 22 అధికార భాషల నుంచి) ఆ నోటు విలువ ముద్రిస్తారు.