చెక్కుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు, అధికారులు అనుసరించాల్సిన, పాటించాల్సిన అంశాలపై ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు కరపత్రాలద్వారా ప్రచారం నిర్వహించారు. వారంపాటు చెక్కులు, పట్టాదార్ పాస్పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ఇవీ వివరాలు..
* చెక్కుల పంపిణీకి నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
* మొదటి కేంద్రంలో 1బీ, పహాణీని పరిశీలిస్తారు.
* రెండో కేంద్రంలో పట్టాదార్ పాస్బుక్, చెక్కు అందజేస్తారు.
* మూడో కేంద్రంలో రైతు సంతకం తీసుకుంటారు.
* నాల్గో కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు.
* గ్రామంలో చెక్కులు, పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీ సందర్భంగా ఏర్పాటుచేసిన కౌంటర్లలో రైతులు వారి చెక్కులు ఏ కౌంటర్లలో ఉందో స్లిప్పు మీద ఉన్న నంబరును బట్టి గుర్తించాలి.
* ఏ కౌంటర్లలో ఏ నంబర్ పాసుబుక్కులు ఉన్నాయో ప్రత్యేకమైన తెరపై ప్రదర్శిస్తారు.
* ఆధార్కార్డు ఒరిజినల్, జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
* పట్టాదారు మాత్రమే చెక్కును తీసుకోవడానికి రావాలి.
* పట్టాదారు అనారోగ్యంతో ఉంటే అధికారులు ఇంటికి వెళ్లి అందజేస్తారు.
* సంబంధిత అధికారులకు రైతులు ఒరిజినల్ ఆధార్కార్డు చూపించిన తర్వాత చెక్కు ఇస్తారు.
* ఆధార్కార్డు నంబర్ ఇవ్వనివారికి పాస్బుక్కు ఇవ్వరు. కేవలం చెక్కులు మాత్రమే ఇస్తారు. చెక్కులు తీసుకొని ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి.
* భూమి వివరాలు సరిగ్గా పడకపోయినా, చెక్ మీద మొత్తం తక్కువగా ముద్రించినా వెంటనే వాటిని ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కౌంటర్లలో గ్రీవెన్స్ ఫారంలో నింపి అధికారులకు అందజేయాలి.
* చెక్కుల పంపిణీకి నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
* మొదటి కేంద్రంలో 1బీ, పహాణీని పరిశీలిస్తారు.
* రెండో కేంద్రంలో పట్టాదార్ పాస్బుక్, చెక్కు అందజేస్తారు.
* మూడో కేంద్రంలో రైతు సంతకం తీసుకుంటారు.
* నాల్గో కేంద్రంలో ఫిర్యాదులు స్వీకరిస్తారు.
* గ్రామంలో చెక్కులు, పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీ సందర్భంగా ఏర్పాటుచేసిన కౌంటర్లలో రైతులు వారి చెక్కులు ఏ కౌంటర్లలో ఉందో స్లిప్పు మీద ఉన్న నంబరును బట్టి గుర్తించాలి.
* ఏ కౌంటర్లలో ఏ నంబర్ పాసుబుక్కులు ఉన్నాయో ప్రత్యేకమైన తెరపై ప్రదర్శిస్తారు.
* ఆధార్కార్డు ఒరిజినల్, జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
* పట్టాదారు మాత్రమే చెక్కును తీసుకోవడానికి రావాలి.
* పట్టాదారు అనారోగ్యంతో ఉంటే అధికారులు ఇంటికి వెళ్లి అందజేస్తారు.
* సంబంధిత అధికారులకు రైతులు ఒరిజినల్ ఆధార్కార్డు చూపించిన తర్వాత చెక్కు ఇస్తారు.
* ఆధార్కార్డు నంబర్ ఇవ్వనివారికి పాస్బుక్కు ఇవ్వరు. కేవలం చెక్కులు మాత్రమే ఇస్తారు. చెక్కులు తీసుకొని ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి.
* భూమి వివరాలు సరిగ్గా పడకపోయినా, చెక్ మీద మొత్తం తక్కువగా ముద్రించినా వెంటనే వాటిని ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కౌంటర్లలో గ్రీవెన్స్ ఫారంలో నింపి అధికారులకు అందజేయాలి.