గోద్రా సంఘటన (Godhra Incident)
🔷గోద్రా సంఘటన ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని పిబ్రవరి 22, 2011న నివేదించిన ప్రత్యేక న్యాయస్థానం-- అహ్మదాబాదు స్పెషల్ కోర్ట్.
♦గోద్రా సంఘటన ఎప్పుడు జరిగింది-- ఫిబ్రవరి 27, 2002.
🔷గోద్రా సంఘటనలో ప్రత్యేక న్యాయస్థానం ఎందరిని దోషులుగా నిర్థారించింది-- 31 మంది.
♦గోద్రా సంఘటనలో ఏ రైలులో మంటలు పెట్టారు-- సబర్మతి ఎక్స్ప్రెస్ (దర్భాంగా - అహ్మదాబాదు).
🔷సబర్మతి ఎక్స్ప్రెస్లో మంటలలో చిక్కుకున్న బోగి-- ఎస్-6.
♦గోద్రా సంఘటన సమయంలో ఎస్-6 బోగీలో ఉన్న వారు ఎక్కడి నుంచి వస్తున్నారు-- అయోధ్య నుంచి (విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు).
🔷ఎస్-6 బోగీ మంటల్లో చిక్కుకోవడం వల్ల మరణించిన కరసేవకుల సంఖ్య-- 59.
♦పెట్రోలు పోసి ఉద్దేశ్యపూర్వకంగానే బోగీని దహనం చేశారని ఇదివరకే తేల్చిచెప్పిన గుజరాత్ ప్రభుత్వం నియమించిన కమీషన్-- నానావతి కమీషన్.
🔷గోద్రా సంఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమేనని నివేదించిన రైల్వేశాఖ (లాలూ ప్రసాద్ హయంలో) నియమించిన కమీషన్--ఉమేశ్ చంద్ర బెనర్జీ కమీషన్.
♦గోద్రా సంఘటనలో ప్రధాన నిందితుడు-- మౌల్వీ ఉమర్జీ.