ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాపథకం | Andhra Pradesh Primary Education Programme(APPEP)
ఈ పథకం కేంద్రప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఓవర్ సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (ODA) వారి ఆర్థిక, విద్యావిషయక సహకారంతో ప్రారంభమైంది.
1984-87లో మొదటిదశగా, 1989-95లో రెండవదశగా రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు అందరు ఉపాధ్యాయులకు వర్తింపజేయబడింది.
ఈ పథకం ఆశయాలు :-
నోట్ : ప్రాథమిక తరగతులలో గుణాత్మక బోధనకు ఈ పథకం ఆరు సూత్రాలను ప్రతిపాదించింది. అవి కృత్యాధార బోధనను (Activity Based Teaching) ను సులభతరం చేసాయి. అవి:
1) అభ్యసన కృత్యాలు కల్పించడం.
2) అనుభవాల ద్వారా అభ్యసనం చేయడం.
3) వ్యక్తిగత, జట్టు, మొత్తం తరగతి పనిని అభివృద్ధి పరచడం.
4) వైయక్తిక బేధాలకు అవకాశం కల్పించడం.
5) స్థానిక పరిసరాలను,వనరులను వినియోగించడం.
6) విద్యార్థుల పనిని ప్రదర్శించడం ద్వారా ఆకర్షణీయమైన తరగతి గదిని రూపొందించడం.
ఈ ఆరుసూత్రాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిల్లో మండల స్థాయిలో, ఉపాధ్యాయ కేంద్రాల స్థాయిలో ఉపాధ్యాయులకు పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ప్రాథమిక పాఠశాలలో జరిగే బోధనను సమర్థం చేసే ప్రయత్నం జరిగింది.
ఈ కార్యక్రమం ఉపాధ్యాయుని సాధికరతలో చేసిన కృషి :