ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం | World Computer Literacy Day
VINAYS INFO
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం - డిసెంబర్ 2
ఉద్దేశ్యం:
కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల గురించి అవగాహన పెంచడం ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం (World Computer Literacy Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
చరిత్ర:
దిల్లీకి చెందిన రాజేంద్ర ఎస్.పవార్, విజయ్ కె.తడని లు IIT Delhiలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
1981లోనే రానున్న కాలంలో కంప్యూటర్లే ప్రపంచాన్ని శాసిస్తాయనే విషయాన్ని గుర్తించి...కంప్యూటర్ వినియోగం నేర్పించేందుకు NIIT(National Institute of Information Technology) అనే సంస్థను నెలకొల్పారు. 1981 డిసెంబర్ 2న డిల్లీలోనే మొదటి శాఖను ప్రారంభించారు.
దీని ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ నివ్వటం ప్రారంభించారు. 2000 నాటికి ప్రపంచంలోని 40 దేశాల్లో రెండు వేల శాఖలు విస్తరించారు.
2001లో NIIT తన 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రారంభించింది.
ఈ క్రమంలో 2001 డిసెంబరు 2న ఒకే రోజు ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి కంప్యూటర్ శిక్షణనిచ్చారు. అదే రోజును ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవంగా ప్రపంచం గుర్తించింది.
ఇతర అంశాలు:
దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాదించిన తొలి గ్రామం - చామ్రవట్టం (కేరళ)
భారత దేశంలో కంప్యూటర్ అక్షరాస్యత కేవలం 6.5%.
అందరికి కంప్యూటర్ విద్య అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2002లో ప్రభుత్వ బడుల్లో కంప్యూటర్ శిక్షణను ప్రవేశ పెట్టింది. 2008 నుంచి కంప్యూటర్ విద్యను NIIT ద్వారా పూర్తిగా ఆధునీకరించింది.