అడవులు
- ఒక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగిన అనేక రకాల వృక్షాలతో కూడుకున్న ప్రదేశాన్ని అడవి అంటారు.- అడవులను ఆంగ్లంలో ఫారెస్ట్ అంటారు. ఫారెస్ట్ అనేది లాటిన్ భాషా పదమైన ఫోరస్ అనే పదం నుంచి ఉద్భవించింది.
- ఫోరస్ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం.
- అడవుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఫారెస్ట్రీ అంటారు.
- దేశంలో 1927లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టాన్ని చేసింది.
- 1952లో నూతన అటవీ విధానాన్ని భారత ప్రభుత్వం రూపొందించింది. (ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్)
- ఈ అటవీ విధానం ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర అటవీ నివేదిక - 2015-16 ప్రకారం తెలంగాణ అటవీ విస్తీర్ణం - 27,292 చ.కి.మీ.
- తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం - 24.35
- భారత్లో అడవుల విస్తీర్ణం పరంగా తెలంగాణ స్థానం - 12 (టీఎస్ సెస్ రిపోర్ట్- 2016-17)
గమనిక: భారతదేశ అటవీ విస్తీర్ణం - 7,01,673 చ.కి.మీ.
- భారతదేశ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం - 21.34 అటవీ విధాన లక్ష్యం- ప్రధాన లక్ష్యం - గ్రామీణ పేదరిక నిర్మూలనకు అడవులను ఆయుధంగా చేసుకోవడం
- అటవీరంగం ద్వారా జీవనోపాధి కల్పన తెలంగాణలో జీవ వైవిధ్యత
- 2800 రకాల మొక్కలు
- 21 రకాల ఉభయచరాలు
- 108 రకాల క్షీరదజాతులు
- 365 రకాల పక్షిజాతులు
- 28 రకాల సరీసృపాలు ఉన్నాయి
- జీవవైవిధ్య రక్షిత ప్రాంతాలు 12. దీనిలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (అభయారణ్యాలు)-9, జాతీయ పార్కులు- 3 ఉన్నాయి.
గమనిక: తెలంగాణలో చిరుతపులి, అడవిదున్న, పులులు, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, బురద మొసలి, డేగలు మొదలైన జంతువులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటిని కాపాడటానికి ఆవాసాంతర రక్షణ, ఆవాసేతర రక్షణలను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది.
- ఆవాసాంతర రక్షణ- జాతీయపార్కులు, అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వులు. ఆవాసాంతర రక్షణ- జీన్ బ్యాంకుల ఏర్పాటు ఉంటుంది.
తెలంగాణలోని జాతీయ పార్కులు
1. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, జూబ్లీహిల్స్, హైదరాబాద్- స్థాపన - 1998
- విస్తీర్ణం - 1.42 చ.కి.మీ.
- ఇది పక్షులకు ప్రసిద్ధి
- పక్షి జాతుల సంఖ్య - 140
- మొక్క జాతుల సంఖ్య - 600

మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు, వనస్థలిపురం, రంగారెడ్డి
- స్థాపన - 1975- విస్తీర్ణం - 14.59 చ.కి.మీ.
- సంరక్షిస్తున్న ముఖ్య జంతువు - జింక
మృగవని జాతీయ పార్కు, చిలుకూరు, మొయినాబాద్, రంగారెడ్డి
- స్థాపన - 1994- విస్తీర్ణం - 3.6 చ.కి.మీ.
- ఇక్కడ సంరక్షిస్తున్న జంతువు - కుందేలు, అడవిపిల్లి, రక్తపింజర, పైథాన్ (కొండ చిలువ), అడవి పంది
- ఈ జాతీయ పార్కు పూర్వపు పేరు - చిలుకూరు రిజర్వు ఫారెస్ట్
- దీన్ని 1994లో వైల్డ్లైఫ్ అభయారణ్యంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. గమనిక: దేశంలోని మొత్తం జాతీయ పార్కుల సంఖ్య- 104, అభయారణ్యాల సంఖ్య- 536 (2016, ఏప్రిల్ వరకు)
తెలంగాణలోని అభయారణ్యాలు -9

1. కవ్వాల్ అభయారణ్యం - వైశాల్యం - 892 చ.కి.మీ.
- ఇది ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉంది.
- దీనిలో 4 పులులు ఉన్నాయి. నీల్గాయ్, అరిచే జింకలు, అడవి దున్న ఉన్నాయి.
2. ప్రాణహిత అభయారణ్యం
- మంచిర్యాల జిల్లా (ప్రాణహిత నది పరీవాహక ప్రాంతం)- వైశాల్యం - 136 చ.కి.మీ.
- అంతరించిపోయే దశలో ఉంది.
- కృష్ణజింక, చింకార, తాబేళ్లు ఉన్నాయి.
3. శివారం అభయారణ్యం
- పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది- వైశాల్యం - 29.81 చ.కి.మీ.
- మొసళ్లు, కష్ణజింక, ఎలుగుబంట్లు ఉన్నాయి
4. ఏటూరు నాగారం అభయారణ్యం
- ఏటూరు నాగారం, జయశంకర్ భూపాలపల్లిలో విస్తరించి ఉంది.- వైశాల్యం - 806.15 చ.కి.మీ.
- దీనిలో తోడేళ్లు, నీల్గాయ్, సాంబార్, కృష్ణజింక, మచ్చల జింక ఉన్నాయి.
గమనిక: ఇది తెలంగాణలో పురాతన అభయారణ్యం
- దీని గుండా గోదావరి నది ప్రవహిస్తుంది
- ఈ అభయారణ్యంలో రాక్షస గూళ్లు, చారిత్రక యుగానికి చెందిన శిలాధారాలు లభించాయి.5. పాకాల అభయారణ్యం
- పాకాల, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది.- వైశాల్యం - 860 చ.కి.మీ
- దీనిలో జంతు జాతులు- సాంబార్, నీల్గాయ్, స్లోత్ బేర్, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, అడవి పందులు
- దీనిలోని పక్షి జాతులు - కొంగలు, గుడ్లగూబలు, అడవి బాతులు
6. కిన్నెరసాని అభయారణ్యం
- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం- వైశాల్యం - 635.40 చ.కి.మీ.
- దీనిలోని జంతువులు - చింకార, హైనా, సాంబార్, అడవి పంది, అడవి దున్న, పులి, కృష్ణజింక
7. అమ్రాబాద్ అభయారణ్యం (రాజీవ్ గాంధీ వైల్డ్లైఫ్ అభయారణ్యం)
- నాగర్కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది.- విస్తీర్ణం - 2166.37 చ.కి.మీ.
- సంరక్షించే జంతువులు - బెంగాల్ పులి, చిరుత, సాంబార్, కృష్ణజింక
గమనిక: ఈ అభయారణ్యాన్ని 1978లో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. 1983లో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు.
- ఇది దేశంలోనే అతిపెద్ద అభయారణ్యం
- రాష్ట్ర విభజనవల్ల ఈ అభయారణ్యాన్ని విభజించారు. తెలంగాణ ప్రభుత్వం అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తిస్తూ 2015, ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది.
- దీనిలోని పులుల సంఖ్య - 9
- ఇండియాలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం- కర్ణాటక (406)
- ఇండియాలో మొత్తం పులుల సంఖ్య- 2226
8. మంజీర అభయారణ్యం
- మెదక్ జిల్లాలో ఉంది- విస్తీర్ణం - 20 చ.కి.మీ.
- ఈ అభయారణ్యంలో 70 రకాల వివిధ పక్షిజాతులు, క్షీరదాలు, వృక్షజాతులు, సరీసృపాలు ఉన్నాయి.
- ఇది ప్రధానంగా మగ్గర్ మొసళ్లకు ప్రసిద్ధి.
9. పోచారం అభయారణ్యం
- ఇది కామారెడ్డి- మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉంది.- విస్తీర్ణం- 130 చ.కి.మీ.
- ఈ అభయారణ్యం నెమళ్లు, పాములు, కొంగలు, బాతులు, చిరుత పులులకు ప్రసిద్ధి
గమనిక: ఔషధ అభయారణ్యం - అనంతగిరి
- దేశంలో మొదటి జాతీయ పార్కు - హేలి (ఉత్తరాఖండ్, 1935)- ప్రస్తుతం దీన్ని జిమ్కార్బెట్ జాతీయపార్కు అని పిలుస్తున్నారు.
- ఇది ఒక వేటగాడి పేరున ఏర్పడిన జాతీయ పార్కు
జీవావరణ కేంద్రాలు
- వీటి సరిహద్దులను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. జంతువులతోపాటు అన్నిరకాల జీవజాతులను రక్షిస్తారు. ఇందులో టూరిజాన్ని అనుమతివ్వరు.- ఇండియాలో మొదట గుర్తించిన జీవావరణ కేంద్రం - నీలగిరి (తమిళనాడు, 1986)
- ఇండియాలో ఇటీవల గుర్తించిన జీవావరణ కేంద్రం- పన్నా (మధ్యప్రదేశ్, 2011)
- ప్రస్తుతం ఇండియాలోని జీవావరణ కేంద్రాల సంఖ్య- 18
- వీటిలో 10 జీవావరణ కేంద్రాలు యునెస్కో జాబితాలో చేర్చారు.
- ఇండియాలోని అతిపెద్ద జీవావరణ కేంద్రం- రాణా ఆఫ్ కచ్ (గుజరాత్, 12,454 చ.కి.మీ.)
- ఇండియాలోని అతిచిన్న జీవావరణ కేంద్రం- దిబ్రు సైకోవా (అసోం, 765 చ.కి.మీ.)
- యునెస్కో వారు గుర్తించిన జీవావరణ కేంద్రాలు
1. నీలగిరి (తమిళనాడు)
2. మన్నార్ సింధుశాఖ (తమిళనాడు)3. సుందర్బన్ (పశ్చిమబెంగాల్)
4. నందాదేవి (ఉత్తరాఖండ్)
5. అగస్త్యమలై (కేరళ, తమిళనాడు)
- అగస్త్యమలై జీవావరణ కేంద్రాన్ని ఇటీవల 2016లో యునెస్కో జాబితాలో చేర్చారు.
తెలంగాణలోని జూలాజికల్ పార్కులు
1. నెహ్రూ జూలాజికల్ పార్క్- షామీర్పేట, హైదరాబాద్, 1963, అక్టోబర్ 3
- ఇది సహజ పరిస్థితులను కల్పింపజేసి ఏర్పాటుచేసిన జూపార్కుల్లో దేశంలోనే మొదటిది.
2. వన విజ్ఞాన కేంద్రం
- వరంగల్, 1985గమనిక: 2001లో కరీంనగర్లో ఉజ్వల పార్కును ఏర్పాటు చేశారు.
తెలంగాణలోని ప్రధాన జింకల పార్కులు (ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి)
1. కిన్నెరసాని జింకల పార్కు- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం2. లోయర్ మానేరు డ్యాం జింకల పార్కు- కరీంనగర్
3. జవహర్లాల్ నెహ్రూ జింకల పార్కు- షామీర్పేట,హైదరాబాద్