అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20 మంది మహిళలకు అవార్డులకు ఎంపిక చేసింది ప్రభుత్వం. మార్చి 8న అవార్డుతో పాటు రూ. లక్ష నగదును అందించనున్నారు.
- విద్యారంగం - కవిత దరియాణి
- క్రీడలు - అరుణా రెడ్డి
- వైద్యం - సత్యలక్ష్మి
- పాత్రికేయం - సౌమ్య నాగపురి(నమస్తే తెలంగాణ), లతా జైన్
- సాహిత్యం - చక్రవర్తుల లక్ష్మీనరసింహ, సిరి
- నాట్యం - మంజులా శ్రీనివాస్
- సంగీతం - నిత్య సంతోషిణి
- చిత్రకళలు - కవితా దేవుష్కర్
- సినీరంగం - నందినీ రెడ్డి
- జానపద సాహిత్యం - ఝాన్సీ
- ఉద్యమగానం - ఎడునూరి పద్మ
- మహిళా వ్యాపారవేత్త - రాజ్యలక్ష్మి
- వృత్తి సేవలు - మెట్రో రైలు మొదటి లోకో డ్రైవర్ సుప్రియ, ఢిల్లీలో ఆర్టీసీ డ్రైవర్ సరిత
- మహిళా సాధికారత - యాప భద్రమ్మ
- వ్యవసాయం - బొగ్గం జయమ్మ
- ప్రజాప్రతినిధుల విభాగం - కొత్తపల్లి గ్రామసర్పంచ్ శైలజ
- సామాజిక సేవ - గండ్ర రమాదేవి
Social Plugin