Type Here to Get Search Results !

Vinays Info

సింధు నాగరికత

Top Post Ad

indus-vally-GreatBat

- ప్రపంచంలో మొట్టమొదట పత్తిని పండించిన వారు?
సింధువాసులు
-సింధు ప్రజల ముఖ్యమైన పరిశ్రమలు?
కాల్చిన ఇటుకల పరిశ్రమ, ముద్రికల పరిశ్రమ, పూసల పరిశ్రమ, నౌకా నిర్మాణ పరిశ్రమ
-సింధు ప్రజలకు తెలియని విషయాలు?
సింధు ప్రజలకు ఇనుము, గుర్రం, చెరుకు పంట గురించి తెలియదు
-పశుపతి ముద్రికలో ఉన్న జంతువులు ఏమిటి?
ఏనుగు, పులి, దున్నపోతు, ఖడ్గమృగం, మనిషి
-సింధు నాగరికతలో కుమ్మరి చక్రం ఏ పట్టణంలో బయటపడినది?
హరప్పా పట్టణంలో..
-సింధు పట్టణాల్లో కోటగోడలేని ఏకైక పట్టణం ఏది?
చాన్హుదారో
-సింధు ప్రజల ఆరాధ్యదైవం ఏమిటి?
అమ్మతల్లి. సింధు ప్రజలు అమ్మతల్లితోపాటు రావిచెట్టు, మూపురం కలిగిన ఎద్దు, పశుపతి, పావురం, పామును పూజించారు.
-సింధునాగరికత పట్టణాల్లో నౌకాశ్రయంగా ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది?
లోథాల్. దీంతోబాటు సర్కటోడలో కూడా నౌకాకేంద్రం ఉన్న ఆనవాళ్లు బయటపడ్డాయి.
-సింధు ప్రజల లిపి ఏమిటి?
చిత్రలిపి (బొమ్మల లిపి). దీనినే హిలియోగ్రాఫిక్, పిక్టోగ్రఫిక్ లిపి అని కూడా పిలుస్తారు. దీనిని ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు సర్పలేఖన ఆకారంలో రాస్తారు.
-మానవుడు మొట్టమొదట ఉపయోగించిన లోహం?
రాగి
-సింధూ నాగరికతలో వరి పండించిన ఆధారాలు ఎక్కడ లభించాయి?
లోథాల్, రంగాపూర్
-తొలివేద కాలంలో గ్రామ సముదాయాన్ని ఏమనేవారు?
విస్ అని పిలిచారు
-ప్రసిద్ధి చెందిన గాయత్రీ మంత్రం ఎందులో ఉంది?
రుగ్వేదం. దీనిని రాసినది విశ్వామిత్రుడు.
-ఆర్యుల కాలానికి సంబంధించిన ఆధారాలేవి?
వేదాలు
-రుగ్వేద కాలంలో తెగనాయకుడిని ఏమనేవారు?
రాజన్
-యాగాల సమయంలో పాటించాల్సిన నియమాలు ఏ వేదంలో ఉన్నాయి?
యజుర్వేదం
-రుగ్వేద కాలంలో తెగలోని ప్రజలందరూ సభ్యులుగా ఉన్న సమూహం ఏది?
సమితి. సభలోని సభ్యులు గ్రామంలోని పెద్దలు
-రుగ్వేద కాలంలో ప్రధాన దేవతలు ? పురంధరుడు (ఇంద్రుడు). రెండో దేవత అగ్ని. మూడో దేవత వరుణుడు.
ashok
-రుగ్వేద కాలంలో ప్రజలు స్వచ్ఛందంగా రాజుకు సమర్పించే పన్ను?
బలి
-ఆర్యులు మధ్య ఆసియా వాసులని బలపరుస్తున్న శాసనాలు?
సిరియాలో లభించిన కాసైట్, ఇరాన్‌లో లభించిన మీటని శాసనాలు, ఆప్ఘనిస్థాన్‌లో లభించిన బోగజ్‌కోయి శాసనం
8 ప్రపంచ సాహిత్యంలో అత్యంత ప్రాచీన మత గ్రంథం?
రుగ్వేదం. దీనినే ఆదిగ్రంథం అనికూడా పిలుస్తారు.
-ధ్యానం, శారీరక వ్యాయామం ద్వారా మోక్షం సాధించవచ్చని పేర్కొన్న దర్శనం ఏది?
యోగశాస్త్రం-పతంజలి
-రుగ్వేద కాలంలో పచ్చిక మైదానాలపై పనిచేసే అధికారిని ఏమంటారు?
వజ్రపతి
-మలివేద కాలంలో సంగ్రహిత్రి అంటే ఎవరు?
కోశాధికారి (సంధివిగ్రహ- విదేశీ వ్యవహారాల మంత్రి)
-మహాభారతం మొదటి పేరు? జయసంహిత. దీనినే పంచమవేదం అని కూడా పిలుస్తారు. దీనిని రాసినది వేదవ్యాసుడు. ఇది ప్రపంచ సాహిత్యంలో అతిపెద్ద గ్రంథం. దీనిలోని భాగాలు పర్వాలు. (6వ పర్వం భీష్మ పర్వంలో 25 అధ్యాయం నుంచి 42 అధ్యాయం వరకు ఉన్న అంశం భగవద్గీత. దీనిలోని శ్లోకాల సంఖ్య 700)
-రుగ్వేద కాలంలో నిష్క అనేది ఏమిటి?
బంగారు ఆభరణం (మలివేదకాలంలో నాణేంగా మారింది)
-గోత్ర అనేపదం గల వేదం? అధర్వణ వేదం
-వృత్స్యస్థ్యోమ క్రతువు అంటే ఏమిటి?
ఆర్యులు కానివారిని ఆర్యులుగా మార్చుకునే క్రతువు
- మహాజన పదాలు వాటి సరిహద్దులు ఏవి ?
ఉత్తరాన-కాంభోజ, దక్షిణాన-అస్మక,
పడమర-అవంతి, తూర్పు-అంగ
-మొదటి సంగీతి-హర్యాంక వంశం- అజాతశత్రువు, రెండోది-శిశునాగవంశం-కాలశోకుడు, మూడోది-మౌర్యవంశం- అశోకుడు. నాల్గోది-కుషాణులు, కనిష్కుడు.
- సైన్యంలో గజదళం ఎక్కువగా ఉన్న జనపదం ?
మగధ జనపదం (ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా లభించడం వల్ల) మగధ సైన్యంలో గజదళం ఎక్కువగా ఉండేది.
- -లోహం?
ఇనుము
- మహాశిలా కంటక, రధముసల అనేవి ఏమిటి ?
అజాత శత్రువు సైన్యంలోని ప్రత్యేక ఆయుధాలు
(బరువైన రాళ్లను విసిరే యంత్రం మహాశిల కంఠక, వేగంగా బాణాలు విసిరే యంత్రం రథముసల. వీటిని బాహుబలి సినిమాలో యుద్ధ సన్నివేశంలో చూపించారు)
-శిశునాగ వంశంలో చివరివాడు ? కాకవర్థిన్
-ఏ రాజు కాలంలో భారతదేశం మొట్టమొదటిసారిగా సామ్రాజ్యంగా అవతరించింది ?
మహాపద్మనందుడి కాలంలో. ఇతను నందవంశ స్థాపకుడు, ఇతనికి ఏకరాట్ అను బిరుదు కలదు.
-మొదటి జైన పరిషత్తు ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షత వహించారు?
క్రీ.పూ. 300 పాటలీపుత్రంలో స్థూలభద్ర అధ్యక్షత వహించాడు.
-12 ఉపాంగాలు ఏ భాషలో రాయబడినవి ?
అర్ధమాగధి భాషలో
-భద్రబాహు రచించిన గ్రంథం ?
జైనకల్ప సూత్రాలు

- మొదటి బౌద్ధ సంగీతిలో రచించిన పీఠకాలు ఏవేవి ?
సుత్తపీఠకం (ఆనందుడు), వినయపీఠకం (ఉపాలి)
-తత్తవిచారం, తార్కితకు ప్రాధాన్యత ఇచ్చిన బౌద్ధమత శాఖ ?
హీనయానం (బుద్ధుడు బోధించినది)
- సత్యమేవ జయతే అనే ధర్మోక్తి ఏ ఉపనిషత్తులో ఉంది ?
ముండకోపనిషత్తు
- భారతదేశంలో బానిస వ్యవస్థ ఏకాలం నుంచి ఉంది?
రుగ్వేదకాలం నుంచి
-వేదకాలంలో జరిగిన దశరాజు యుద్ధానికి కారణం?
పశుగణాలపై ఆధిపత్యం కోసం
-మలివేద కాలంలో ప్రసిద్ధి పొందిన రచయిత్రులు ఎవరు ?
గార్గి, అపాల, లోపముద్ర, మైత్రేయ, విశ్వవర
-హర్యాంక రాజ్యస్థాపకుడు ఎవరు ? బింబిసారుడు
-16 జనపదాల గురించి తెలిపే గ్రంథం ఏది ?
అంగుట్టరనికాయ, ఇది బౌద్ధమత గ్రంథం
-దక్షిణాపథంలో ఉన్న ఏకైక జనపదం ఏది ?
అస్మక దీని రాజధాని-పూతన (నేటి నిజామాబాద్ జిల్లాలోని బోధన్)
-హర్యాంక వంశంలో గొప్పవాడు ? అజాతశత్రువు
-పాటలీపుత్రాన్ని నగరంగా తీర్చిదిద్దిన రాజధానిగా ఏలినవాడు ? ఉదయనుడు (పాటలీ గ్రామాన్ని అజాతశత్రువు నిర్మించాడు)
-పాటలీపుత్రాన్ని జలదుర్గం అని ఎందుకు అంటారు ?
పాటలీపుత్రం గంగ, శోణ (సోన్), సరయూ, గండకి నదులు, సంగమస్థానంలో ఉంది కనుక జలదుర్గంగా పేర్కొన్నారు.
- శిశునాగ వంశం కాలంలో రాజధాని ?
వైశాలి (ఇది వజ్జి జపదానికి రాజధాని నగరం)
- మహీష్మతి నగరం ఏ జనపదానికి రాజధాని ?
అవంతి జనపదానికి దక్షిణ రాజధాని (ఉత్తరాన ఉన్న మరో రాజధాని ఉజ్జయిని)
- 16 మహాజనపదాల్లో లేని రాజ్యాలు/ప్రాంతాలు ఏవి ?
వంగ (బెంగాల్), కళింగ (ఒడిశా) రాజ్యాలు లేవు
-శాక్యజ్ఞాని, శాక్యముని, తథాగతుడు, అంగీరసుడు అనే బిరుదులెవరివి? గౌతమబుద్ధుడివి
-లలితా విస్తార అనే గ్రంథాన్ని The light of Asia అనే పేరుమీద ఆంగ్లంలోకి అనువదించినవారు?
సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ (మహాత్మాగాంధీని ఎక్కువగా ప్రభావితం చేసిన గ్రంథం)
-నిర్గంధ విధానాన్ని ప్రవేశపెట్టిన వాడు? పార్శనాథుడు (ఈయన జైనమతంలో 23వ తీర్థంకురుడు)
- వర్ధమాన మహావీరుని బిరుదులు?
న్యాయపుత్త, దేహదిన్న
-సింహాసనాన్ని త్యజించి, జైన మతాన్ని స్వీకరించి, సల్లేఖన వ్రతం ద్వారా మరణాన్ని పొందినవాడు?
మౌర్య చంద్రగుప్తుడు
- బుద్ధుని జీవితంలో 5 సంఘటనలు వాటి ప్రతీకలు ఏవీ?
జననం : పద్మం
మహాపరిత్యాగం : అశ్వం
నిర్వాణం : బోధివృక్షం
మొదటి ధర్మోపదేశం: ధర్మచక్రం
మమహా పరినిర్యాణం: స్తూపం
8 మలివేదకాలంలో ప్రముఖంగా ప్రారంభమైన సాంఘికాచారాలు పేర్కొనండి?
1. చతురశ్రామ ధర్మాలు ఏర్పడ్డాయి
2. గోత్రపద్ధతి ఏర్పడింది.
3. స్త్రీ పురుష అసమానతలు ప్రారంభం
4. బాల్య వివాహాలు ప్రారంభమయ్యాయి, వితంతు పునర్వివాహాలు నియోగ పద్ధతిలో ఒప్పుకోబడ్డాయి
-జైనమతంలో పూజింపబడిన స్త్రీ దేవత ఎవరు?
విద్యాదేవి (సరస్వతీ దేవత)
-ముద్ర రాక్షసం ప్రధానంగా పేర్కొనబడిన విషయం?
ముద్రరాక్షసం విశాఖదత్తుడు రచించాడు. ఈ గ్రంథంలో మహాపద్మనందుని మంత్రి అయిన రాక్షసుడు చంద్రుగుప్త మౌర్యునికి ప్రధాన మంత్రి అయిన విషయం వర్ణించబడింది.
ఆలయాలు-నిర్మించిన రాజులు
-కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని నిర్మించిన తూర్పు గాంగ రాజు : మొదటి నర్సింహవర్మ
- పూరిలోని జగన్నాథ ఆలయాన్ని నిర్మించినది :
చోడ అనంతరవర్మ
-ఒరిస్సాలోని భువనేశ్వర్ లింగరాజ ఆలయాన్ని నిర్మించినది : చోడ అనంతవర్మ
-కాంబోడియాలోని ప్రసిద్ధిగాంచిన అంగర్‌కోట్ దేవాల యాన్ని నిర్మించిన చక్రవర్తి: రెండో సూర్యవర్మ
-ఢిల్లీ నగరాన్ని నిర్మించిన రాజపుత్ర రాజు:
తోమర ఆనందపాలుడు
-ఎల్లోరాలోని దశావతార దేవాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు : మొదటి దంతిదుర్గుడు
- ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని నిర్మించినది?
రాష్ట్రకూట మొదటి కృష్ణుడు
-కంచిలోని కైలాసనాథ ఆలయాన్ని నిర్మించినది?
పల్లవ రెండో నర్సింహవర్మ
-తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన చోళ చక్రవర్తి : మొదటి రాజరాజచోళుడు
-కాశ్మీరులోని మార్తాండవర్మ ఆలయాన్ని నిర్మించినది: కర్కోటక వంశానికి చెందిన లలితాదిత్య ముక్తాపిద
-హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ చక్రవర్తి : మొదటి ప్రతాపరుద్రుడు
-పోలంపేటలోని రామప్పదేవాలయాన్ని నిర్మించినది: గణపతి దేవుని మంత్రి రేచర్లరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు
-పూరిలోని జగన్నాథ ఆలయాన్ని కూలగొట్టిన ఢిల్లీ సుల్తానేట్ : ఫిరోజ్‌షాతుగ్లక్
-ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాన్ని కూలగొట్టిన ఢిల్లీ సుల్తాన్ : ఇల్‌టుట్ మిష్
-ఢిల్లీలోని అలైదర్వాజాను నిర్మించినది : అల్లావుద్దీన్ ఖిల్జీ
-ఢిల్లీలోని హపుజ్‌ఖాస్‌ను నిర్మించినది : ఫిరోజ్‌షా తుగ్లక్
-ఖువ్వాతుల్ - ఇస్లాం మసీదును నిర్మించిన బానిస వంశ రాజు : కుతుబుద్దీన్ ఐబక్
-అజ్మీర్‌లోని అర్వాదిన్‌కా జోప్డాను నిర్మించినది: కుతుబుద్దీన్ ఐబక్
-వాస్తు నిర్మాణంలో డబుల్‌డోమ్ పద్ధతిని ప్రవేశపెట్టిన ముస్లిం పాలకులు : లోడీలు
-ఆగ్రాలోని మోతీమసీదును నిర్మించిన మొఘలాయి రాజు: షాజహన్
-మధురలోని కేశవరామ ఆలయం, బెనారస్‌లోని విశ్వనాథ ఆలయాలను ధ్వంసం చేసినది: ఔరంగజేబు

-విజయనగర రాజ్యంలో ఇండో-ఇస్లామిక్ శైలిలో నిర్మించిన నిర్మాణం: పద్మా మహల్
-రెండు ధ్వజస్తంభాలు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక ఆలయం : శ్రీకూర్మం
-ముంబై సముద్రతీరానికి కొంత దూరంలో ఉన్న ఎలిఫెంటా గుహలను నిర్మించినది : రాష్ట్రకూటులు

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.