కేతన
VINAYS INFO
కేతన :
మూలఘటిక కేతన క్రీ.శ. 1200లో జన్మించాడు. ఇతని రచన "దశకుమార చరిత్ర". దీనిని తిక్కనకు అంకితమిచ్చాడు. ఇతడు "ఆంధ్ర భాషాభూషణం" మరియు "విజ్ఞానేశ్వరీయం" అను మరో రెండు గ్రంధాలు రచించాడు. ఆంధ్రా భాషణం తెలుగు భాషలో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణం. కేతనకు "అభినవ దండి" అనే బిరుదు ఉంది. దండి వ్రాసిన దశకుమార చరిత్రను కేతన చంపూ కావ్యంగా రచించాడు. ఇది తెలుగులో తొలి కథా కావ్యం. సామెతలు, పలుకుబళ్ళు, జాతీయాలు ఇతని రచనల్లో కోకొల్లలు. తెలుగులో తొలి కథా కావ్యము, తొలి ధర్మ శాస్త్ర గ్రంధము, తొలి లక్షణ గ్రంధమును రచించిన కేతన సదా స్మరణీయుడు.